ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెను : పాస్టర్ ఎర్నెస్ట్ పాల్
అమలాపురం, డిసెంబరు 24 ( పున్నమి ప్రతినిధి ) :
ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెననీ పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ తన క్రిస్మస్ సందేశం లో పేర్కొన్నారు. డా.బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ లోని శాంతిని కేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందించారు. సాటి వారిని ప్రేమించి సమాజంలో అసమానతలు తొలగించుకోవడమే క్రీస్తు బోధనలు ముఖ్య ఉద్దేశమన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గణిత పోటీలలో విజేతలకు మెమంటో ష్, సర్టిఫికెట్స్ అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ బి.నాగరాజు, సెక్రటరీ ప్రసన్న లక్ష్మీ, ప్రిన్సిపాల్ కే.వి.వి.ఎస్. సత్యనారాయణ, ఏ .ఓ నాగదుర్గ, ఉపాధ్యాయ బృందం ప్రసాద్, భవాని, జ్యోతి, వనితా దేవి, కావ్య, అపర్ణ, ఎన్.కనక దుర్గ, అలేఖ్య పాల్గొన్నారు.

ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెను : పాస్టర్ ఎర్నెస్ట్ పాల్
ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెను : పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ అమలాపురం, డిసెంబరు 24 ( పున్నమి ప్రతినిధి ) : ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెననీ పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ తన క్రిస్మస్ సందేశం లో పేర్కొన్నారు. డా.బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ లోని శాంతిని కేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందించారు. సాటి వారిని ప్రేమించి సమాజంలో అసమానతలు తొలగించుకోవడమే క్రీస్తు బోధనలు ముఖ్య ఉద్దేశమన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గణిత పోటీలలో విజేతలకు మెమంటో ష్, సర్టిఫికెట్స్ అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ బి.నాగరాజు, సెక్రటరీ ప్రసన్న లక్ష్మీ, ప్రిన్సిపాల్ కే.వి.వి.ఎస్. సత్యనారాయణ, ఏ .ఓ నాగదుర్గ, ఉపాధ్యాయ బృందం ప్రసాద్, భవాని, జ్యోతి, వనితా దేవి, కావ్య, అపర్ణ, ఎన్.కనక దుర్గ, అలేఖ్య పాల్గొన్నారు.

