” ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ” ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్ కు మార్గం అని భావించి ఏకమైవుదాం .
మేడా శ్రీనివాస్ , పిలుపు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
************************
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజన అనంతరం ఏ విధమైన అభివృద్ధి లేక పోయింది . నష్ట పోయింది. నష్ట పోతుంది. జరిగుతున్న నష్టం వెల కట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ వాదులు బావించాలి ..
ప్రస్తుతం చంద్రబాబు కూటమికి , జగన్ కు గల సమస్యల కారణాల రిత్యా మోదీ సర్కార్ ను ప్రశ్నించలేని బలహీన స్థితిలో వారు వున్నారు . ఎన్నటికీ మోదీ ని వీరు ఎదిరించలేరు . ఆంధ్రప్రదేశ్ కు ఏమి సాధించను లేరు అనేది యదార్థం..
కాలయాపన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం , బావి తరాల అభ్యున్నతి కోసం ఏకమైవుదాం . సిద్ధంకండి ..
అజెండా
*******
(1) ప్రత్యేక హోదా , రాయితీలతో కూడిన విభజన హామీలు ..
(2) యుద్ద ప్రాతిపదికన మహా అద్భుతమైన రాజధాని నిర్మాణం.
(3) పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధన..
(4) రామాయపట్నం మేజర్ పోర్ట్ సాధన..
(5) కడప ఉక్కు ఫ్యాక్టరి సాధన..
(6) 12 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కే జి బేసిన్ నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% ఆర్ధిక వాటా సాధన .
(7) యువత పై అక్రమ కేసులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్యల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహిద్దాం ..
విద్యార్థులు, యువత, మేధావులు, న్యాయవాదులు , విద్యావంతులు , విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్ట్ లు , కార్మికులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు , ఉద్యమ సంస్థలు, ఉద్యమ రాజకీయ పార్టిలు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం ఏకం అవుదాం .. ఆ నాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి ని ప్రతి ఆంధ్రుడిలోను తట్టి లేపుదాం ..
జై ఆంధ్రప్రదేశ్ ..
సేవ్ ఆంధ్రప్రదేశ్..


