రాజంపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రాజంపేట రైల్వే స్టేషన్ నందు నిర్వహించిన స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబెర్స్ మరియు ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ అభివృద్ధి మరియు రాజంపేట రైల్వే స్టేషన్ నందు సీనియర్ సిటిజన్స్ కొరకు లిఫ్ట్ ప్రొవిజన్,మరియు స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు RO నీరు తదితర అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీ జనార్ధన్ గారు, రైల్వే వినియోగదారులు మరియు స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.
మీ- సనిసెట్టి నవీన్ కుమార్ .
అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం ,రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.


