కామారెడ్డి, 17నవంబర్, ( పున్నమి ప్రతినిధి ). :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని పోసా నిపేట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుద్దాల బాలరాజు మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ కల్పన జరుగుతోం ది. ఈ పథకాన్ని ప్రతి అర్హుడి దాకా చేరేలా కృషి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామంలో ఇంకా ఇళ్లు పూర్తి కావాల్సివున్న వారికి త్వరలోనే పనులు పూర్తి అవుతాయి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, గ్రామ కార్యద ర్శి, పార్టీ నాయకులు,AMC డైరెక్టర్ బట్టు సత్యం, మండల ఉపాధ్యక్షుడు నా.రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు నా.రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల సీనియర్ నాయకు లు మెలిగే నరేందర్, మండల ఎస్సీ సెల్ నాయకు లు, గంగాధర్, దెబ్బతిలింగం, మహిళా కమిటీ అధ్యక్షురాలు కుడుదుల అంజ వ్వ, సభ్యురాలు విజయ పాల్గొన్నారు


