రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం రాజమండ్రిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 13 మంది లబ్ధిదారులు రూ. 21,34,680 విలువైన ఆర్థిక సహాయం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,
“పేదవారి ఆరోగ్య రక్షణ కోసం సీఎం సహాయనిధి ఒక సంజీవనిలా ఉపయోగపడుతోంది. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ, పేదలకు మరింత చేరువగా ఉండే విధానాలను అమలు చేస్తోంది. పేదల ఆరోగ్య సంరక్షణే మా ధ్యేయం,” అని పేర్కొన్నారు.
అలాగే, అవసరమైన సమయంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యంగా వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి ఎంతో సహాయకరమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


