ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తొలిసారి కొత్తజంట ఉదయపూర్ విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ‘వీరోష్’ జంటను చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలపగా, వారు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉత్సాహపరిచారు.



