ఖమ్మం ఫిబ్రవరి
పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యాన్నగూడెం గ్రామ శివారు నాయకులగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ మట్టా దయానంద్, మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు, చీకటి రామారావు నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొంతు సత్యవతి, ఉప సర్పంచ్ కావిటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జాతరలో భాగంగా పెద్దమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం భక్తి పరవశంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరిగినది


