Monday, 2 March 2026
  • Home  
  • పురాతన వైభవం.. ఆధునిక పరిరక్షణ- శివాలయ పైకప్పు లీకేజీ పనుల పరిశీలన
- తిరుపతి

పురాతన వైభవం.. ఆధునిక పరిరక్షణ- శివాలయ పైకప్పు లీకేజీ పనుల పరిశీలన

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఆలయ పైకప్పు లీకేజీ నివారణ పనులను సోమవారం నాడు భారత పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా వర్షాకాలంలో భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పనులు నిర్వహించారు. సుమారు రూ. 5 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎక్కడా ఆధునిక సిమెంట్ వినియోగించకుండా, పురాతన దేవాలయ నిర్మాణ శైలికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురాతన కట్టడాల పునరుద్ధరణలో విశేష అనుభవం ఉన్న పూణేకు చెందిన నిపుణులైన కార్మికులు ఈ పనులను పూర్తి చేశారు. సాంకేతికత ఎంత పెరిగినా, పురాతన కట్టడాలకు ప్రకృతి సిద్ధమైన ముడిపదార్థాలే బలమని నిరూపిస్తూ ఈ పనులు చేపట్టారు. ఇందులో వాడిన ప్రధాన పదార్థాలు సున్నం, బెల్లం, కరక్కాయ పొడి. కాల్చిన బంకమట్టి, ఇటుక ముక్కలు. అరబ్ దేశాలలోని అడవుల నుండి సేకరించిన ప్రత్యేకమైన వృక్ష ఆధారిత జిగురు ఈ పదార్థాల మిశ్రమం పైకప్పుకు అదనపు బలాన్ని ఇవ్వడమే కాకుండా, శతాబ్దాల పాటు నీరు నిలవకుండా, లోపలికి ఇంకకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. “దేవాలయాల వారసత్వాన్ని కాపాడటం మన బాధ్యత. పూణే కార్మికులు చూపిన నైపుణ్యం అభినందనీయం. ప్రస్తుతం పనులు పూర్తయిన తీరుపై పూర్తి సంతృప్తిగా ఉన్నామని ఈ పనుల వల్ల రాబోయే కాలంలో లీకేజీ సమస్య తలెత్తదని, ఆలయ నిర్మాణం మరింత పటిష్టమైందని ఆయన వెల్లడించారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఆలయ పైకప్పు లీకేజీ నివారణ పనులను సోమవారం నాడు భారత పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా వర్షాకాలంలో భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పనులు నిర్వహించారు. సుమారు రూ. 5 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎక్కడా ఆధునిక సిమెంట్ వినియోగించకుండా, పురాతన దేవాలయ నిర్మాణ శైలికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురాతన కట్టడాల పునరుద్ధరణలో విశేష అనుభవం ఉన్న పూణేకు చెందిన నిపుణులైన కార్మికులు ఈ పనులను పూర్తి చేశారు. సాంకేతికత ఎంత పెరిగినా, పురాతన కట్టడాలకు ప్రకృతి సిద్ధమైన ముడిపదార్థాలే బలమని నిరూపిస్తూ ఈ పనులు చేపట్టారు. ఇందులో వాడిన ప్రధాన పదార్థాలు సున్నం, బెల్లం, కరక్కాయ పొడి. కాల్చిన బంకమట్టి, ఇటుక ముక్కలు. అరబ్ దేశాలలోని అడవుల నుండి సేకరించిన ప్రత్యేకమైన వృక్ష ఆధారిత జిగురు ఈ పదార్థాల మిశ్రమం పైకప్పుకు అదనపు బలాన్ని ఇవ్వడమే కాకుండా, శతాబ్దాల పాటు నీరు నిలవకుండా, లోపలికి ఇంకకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. “దేవాలయాల వారసత్వాన్ని కాపాడటం మన బాధ్యత. పూణే కార్మికులు చూపిన నైపుణ్యం అభినందనీయం. ప్రస్తుతం పనులు పూర్తయిన తీరుపై పూర్తి సంతృప్తిగా ఉన్నామని ఈ పనుల వల్ల రాబోయే కాలంలో లీకేజీ సమస్య తలెత్తదని, ఆలయ నిర్మాణం మరింత పటిష్టమైందని ఆయన వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.