కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా అర్హత లేని లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి సాయం పొందుతున్న 31.01 లక్షల అనుమానాస్పద కేసులు గుర్తించబడ్డాయి.
ఇందులో ఇప్పటివరకు పరిశీలించిన 19.02 లక్షల కేసుల్లో 17.87 లక్షల మంది (93.98%) భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు అనర్హుల ఏరివేతకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 15 నాటికి ఈ తనిఖీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది.
పీఎం-కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, ఒక రైతు కుటుంబంలో భార్య లేదా భర్తలో ఎవరో ఒకరే పెట్టుబడి సాయం పొందడానికి అర్హులు. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. అదనంగా, మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, భూమి అమ్మిన తర్వాత పాత–కొత్త యజమానులు ఇద్దరూ లబ్ధి పొందడం వంటి అక్రమాలు కూడా నమోదయ్యాయి.
ఇలాంటి అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునే ప్రతి రైతుకు **రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి


