శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఉషా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 కళాశాలల్లో తిరుపతి జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల చోటు దక్కించుకుందని కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ ప్రకట ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ….ఈ పథకం ద్వారా కళాశాలకు మొత్తం రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడైనదని ఈ నిధులతో రూ.3 కోట్ల వ్యయంతో 8 గదుల నూతన భవనం నిర్మాణం, రూ.1 కోట్లతో ఆధునిక ల్యాబ్ పరికరాల కొనుగోలు, రూ.50 లక్షలతో కళాశాల మరమ్మతులు, మరో రూ.50 లక్షలతో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడి, విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఎం ఉషా పథకంలో శ్రీకాళహస్తి మహిళా కళాశాల ఎంపిక – రూ.5 కోట్ల నిధులు
శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఉషా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 కళాశాలల్లో తిరుపతి జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల చోటు దక్కించుకుందని కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ ప్రకట ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ….ఈ పథకం ద్వారా కళాశాలకు మొత్తం రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడైనదని ఈ నిధులతో రూ.3 కోట్ల వ్యయంతో 8 గదుల నూతన భవనం నిర్మాణం, రూ.1 కోట్లతో ఆధునిక ల్యాబ్ పరికరాల కొనుగోలు, రూ.50 లక్షలతో కళాశాల మరమ్మతులు, మరో రూ.50 లక్షలతో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడి, విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

