Sunday, 15 February 2026
  • Home  
  • పి.సి. ప్రకాశ్‌కు అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం
- తిరుపతి

పి.సి. ప్రకాశ్‌కు అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం

తిరుపతి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 15: పుత్తూరులోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ (యాంత్రిక శాస్త్రం) విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి. సి. ప్రకాశ్ కు చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. శనివారం నాడు జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన ఈ గౌరవాన్ని ప్రకాశ్ అందుకున్నారు. తిరుపతి వాస్తవ్యులైన పి. సి. ప్రకాశ్, “ఎఫెక్ట్ ఆఫ్ మోడిఫైడ్ నానోగ్రాఫీన్ ఆక్సైడ్ లోడింగ్ ఆన్ ది మెకానికల్ ప్రాపర్టీస్, స్వెల్లింగ్ రెసిస్టెన్స్, అండ్ కంప్రెషన్ సెట్ బిహేవియర్ ఆఫ్ ఈపిడిఎమ్/ఎస్‌బిఆర్ బ్లెండ్ నానోకాంపోజిట్స్” అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనను నాగపట్టణంలోని (ఈజీఎస్‌పెక్) ప్రొఫెసర్ డాక్టర్ వి. నవనీతకృష్ణన్ పర్యవేక్షణలో ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. నానో టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన ఈ కృషికి గాను యూనివర్సిటీ ఈ డాక్టరేట్ పట్టాను అందజేసింది. డాక్టరేట్ సాధించిన పి. సి. ప్రకాశ్ గారిని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, తోటి అధ్యాపకులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు. ఆయన చేసిన ఈ పరిశోధన భవిష్యత్తులో సాంకేతిక రంగానికి ఎంతో దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

తిరుపతి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 15: పుత్తూరులోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ (యాంత్రిక శాస్త్రం) విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి. సి. ప్రకాశ్ కు చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. శనివారం నాడు జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన ఈ గౌరవాన్ని ప్రకాశ్ అందుకున్నారు. తిరుపతి వాస్తవ్యులైన పి. సి. ప్రకాశ్, “ఎఫెక్ట్ ఆఫ్ మోడిఫైడ్ నానోగ్రాఫీన్ ఆక్సైడ్ లోడింగ్ ఆన్ ది మెకానికల్ ప్రాపర్టీస్, స్వెల్లింగ్ రెసిస్టెన్స్, అండ్ కంప్రెషన్ సెట్ బిహేవియర్ ఆఫ్ ఈపిడిఎమ్/ఎస్‌బిఆర్ బ్లెండ్ నానోకాంపోజిట్స్” అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనను నాగపట్టణంలోని (ఈజీఎస్‌పెక్) ప్రొఫెసర్ డాక్టర్ వి. నవనీతకృష్ణన్ పర్యవేక్షణలో ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. నానో టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన ఈ కృషికి గాను యూనివర్సిటీ ఈ డాక్టరేట్ పట్టాను అందజేసింది. డాక్టరేట్ సాధించిన పి. సి. ప్రకాశ్ గారిని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, తోటి అధ్యాపకులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు. ఆయన చేసిన ఈ పరిశోధన భవిష్యత్తులో సాంకేతిక రంగానికి ఎంతో దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.