

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి శిబిరం నిర్వహించబడింది.
200 మందికి కంటి పరీక్షలు జరగగా, 90 మందిని ఆపరేషన్కు రిఫర్ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు గారు, సభ్యులు, బాల వికాస్ గురువులు, సాయి భక్తులు పాల్గొన్నారు.
సమితి తరపున భవిష్యత్తులో జరిగే ఉచిత వైద్య శిబిరాలకు ప్రజలు మరింతగా పాల్గొని లబ్ధి పొందాలని కోరారు.#ఉచితకంటిశిబిరం #శ్రీసత్యసాయిసేవాసమితి #Srikakulam #Narasannapeta

