మనుబోలు 17-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మనుబోలు జాతీయ రహదారి మీద వారి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికుల కు ఆహారం లేక ఇబ్బందుల పడుతున్న పరిస్థితిలను గుర్తించి తమ వంతు సాయంగా పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆద్వర్యం లో 200 మంది వలస కూలీలకు సాయంత్రం వేళలో టమోటా అన్నం పంపిణీ చేసారు. జాతీయ రహదారి వెంట వేలుతున్న వలస కార్మికులను మనుబోలు గ్రామాల్లోని ప్రజలు వివిధ రూపాలలో ఆదుకోవడం పట్ల వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


