Wednesday, 25 March 2026
  • Home  
  • పార్ట్‌టైం ఉద్యోగాల మోసాలపై జాగ్రత్త : చిట్వేల్ ఎస్‌ఐ హెచ్చరిక
- అన్నమయ్య

పార్ట్‌టైం ఉద్యోగాల మోసాలపై జాగ్రత్త : చిట్వేల్ ఎస్‌ఐ హెచ్చరిక

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చిట్వేల్ పట్టణ ఎస్‌ఐ నవీన్‌బాబు ప్రజలకు అప్రమత్తం అయ్యేలా సూచించారు. ఇంట్లో కూర్చునే సులభంగా లక్షల్లో సంపాదించవచ్చని చెప్పే ఆన్‌లైన్ ప్రకటనలు, వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మరాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ఇటువంటి ఆఫర్ల వలలో పడి డబ్బులు కోల్పోయారని గుర్తుచేశారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలు పంచుకుంటే పెద్ద మోసాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చిన వెంటనే డిలీట్ చేసి, అవసరమైతే సమీప పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని సూచించారు. ప్రజల జాగ్రత్తతోనే ఈ మోసగాళ్లకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్‌ఐ నవీన్‌బాబు స్పష్టం చేశారు.

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చిట్వేల్ పట్టణ ఎస్‌ఐ నవీన్‌బాబు ప్రజలకు అప్రమత్తం అయ్యేలా సూచించారు. ఇంట్లో కూర్చునే సులభంగా లక్షల్లో సంపాదించవచ్చని చెప్పే ఆన్‌లైన్ ప్రకటనలు, వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మరాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ఇటువంటి ఆఫర్ల వలలో పడి డబ్బులు కోల్పోయారని గుర్తుచేశారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలు పంచుకుంటే పెద్ద మోసాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చిన వెంటనే డిలీట్ చేసి, అవసరమైతే సమీప పోలీస్‌స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని సూచించారు. ప్రజల జాగ్రత్తతోనే ఈ మోసగాళ్లకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్‌ఐ నవీన్‌బాబు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.