ఇంటి పన్నులను ఆస్తి విలువ ఆధారంగా పెంచేందుకు కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించడం వల్ల ప్రజల అధోగతి పాలవుతున్నారు అని సీపీఎం నాయకుడు చల్లకొలుసు మల్లిఖార్జున అన్నారు.మంగళవారం పట్టణంలోని స్థానిక 5 వ సచివాలయం వద్ద ఆస్తి పన్నుల పెంపు పై సీపీఎం పార్టీ, సి ఐ టి యు,బుచ్చిరెడ్డి పాలెం పౌర సమాఖ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం,బుచ్చి పౌర సమాఖ్య నాయకులు చల్లకోలుసు మల్లిఖార్జున మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడంతో పాటు నీటి పన్నులు,డ్రైనేజ్ చార్జీలు పెంచడం,చెత్త పై కొత్తగా పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని అన్నారు.రానున్న ఏప్రిల్ నెల నుండి పన్నుల మోత అమలులోకి రానున్న నేపథ్యంలో కోటి అరవై లక్షల మంది ప్రజలపై పది వేల కోట్ల రూపాయల భారం పడనుంది అని తెలిపారు.73,74 రాజ్యంగా సవరణ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు పన్నులు నిర్ణయించే అధికారం ఉందని,కానీ రాష్ట్రం లో స్థానిక ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సభ్యులు పన్నులు నిర్ణయించాలని పేర్కొన్నారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కార్పోరేట్ పన్నులలో రాయితీలు ఇస్తూ పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది అని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ఈ విధంగా పన్నులు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజానీకం అవస్థలు ఎదుర్కుంటారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మొండి వైఖరి అవలంబిస్తునదని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలపై భారాలు మోపే చట్టాలను ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని అన్నారు.దీని వల్ల ఇంటి యజమానులు ఇంటి అద్దెలు అధికంగా పెంచే అవకాశం ఉందని వలస వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.ఇకనైనా ప్రభుత్వ ప్రజల సంక్షేమానికే అడ్డుకునే చట్టాలను వెంటనే వెనుకకు తీసుకోవాలని,అలా కాని పక్షంలో ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.2021 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన పన్నుల రద్దుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని,మునిసిపల్,కార్పోరేషన్,పట్టణ పంచాయతీ కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసనలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జానీ బాష, పోతంశెట్టి శ్రీనివాసులు మల్లికార్జున, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సురేష్, మండల కార్యదర్శి మునీర్ భాషా, సీఐటీయూ నాయకులు,సీపీఎం నాయకులు బుచ్చి పౌర సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.
పన్నుల మోతతో ప్రజలు అధోగతి పాలవుతున్నారు….సీపీఎం ,బుచ్చి పౌర సమాఖ్య
ఇంటి పన్నులను ఆస్తి విలువ ఆధారంగా పెంచేందుకు కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించడం వల్ల ప్రజల అధోగతి పాలవుతున్నారు అని సీపీఎం నాయకుడు చల్లకొలుసు మల్లిఖార్జున అన్నారు.మంగళవారం పట్టణంలోని స్థానిక 5 వ సచివాలయం వద్ద ఆస్తి పన్నుల పెంపు పై సీపీఎం పార్టీ, సి ఐ టి యు,బుచ్చిరెడ్డి పాలెం పౌర సమాఖ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం,బుచ్చి పౌర సమాఖ్య నాయకులు చల్లకోలుసు మల్లిఖార్జున మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడంతో పాటు నీటి పన్నులు,డ్రైనేజ్ చార్జీలు పెంచడం,చెత్త పై కొత్తగా పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని అన్నారు.రానున్న ఏప్రిల్ నెల నుండి పన్నుల మోత అమలులోకి రానున్న నేపథ్యంలో కోటి అరవై లక్షల మంది ప్రజలపై పది వేల కోట్ల రూపాయల భారం పడనుంది అని తెలిపారు.73,74 రాజ్యంగా సవరణ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు పన్నులు నిర్ణయించే అధికారం ఉందని,కానీ రాష్ట్రం లో స్థానిక ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సభ్యులు పన్నులు నిర్ణయించాలని పేర్కొన్నారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కార్పోరేట్ పన్నులలో రాయితీలు ఇస్తూ పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది అని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ఈ విధంగా పన్నులు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజానీకం అవస్థలు ఎదుర్కుంటారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మొండి వైఖరి అవలంబిస్తునదని అన్నారు. పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలపై భారాలు మోపే చట్టాలను ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని అన్నారు.దీని వల్ల ఇంటి యజమానులు ఇంటి అద్దెలు అధికంగా పెంచే అవకాశం ఉందని వలస వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.ఇకనైనా ప్రభుత్వ ప్రజల సంక్షేమానికే అడ్డుకునే చట్టాలను వెంటనే వెనుకకు తీసుకోవాలని,అలా కాని పక్షంలో ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.2021 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన పన్నుల రద్దుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని,మునిసిపల్,కార్పోరేషన్,పట్టణ పంచాయతీ కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసనలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జానీ బాష, పోతంశెట్టి శ్రీనివాసులు మల్లికార్జున, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సురేష్, మండల కార్యదర్శి మునీర్ భాషా, సీఐటీయూ నాయకులు,సీపీఎం నాయకులు బుచ్చి పౌర సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

