Friday, 6 February 2026
  • Home  
  • నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- తిరుపతి

నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖ రాణిలు చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి యూనిట్ ఇంచార్జి సల్లా గోవిందు పుషగుచ్చము అందించి, శాలువాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో, మంత్రి లోకేష్ సహకారంతో నేతన్నల అభివృద్ధి కి కృషి చేస్తానని చేనేతల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చేనేత రంగం పునరుద్ధరణకు, ఆధునీకరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చేనేత కుటుంబాల్లో ఆశలు నింపుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం, మంత్రి లోకేష్ సేవలు అద్భుతమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సదస్సులో సీనియర్ చేనేత నాయకులు కన్నా వెంకటేశ్వర్లు తానూ స్వయంగా నేసిన నాణ్యమైన చేనేత వస్త్రం తో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. 13 వ తేదీ చేనేత మంత్రి సవిత చేతులమీదుగా 192 మంది నేతన్నలకు పనిముట్లు అందజేయడం జరుగుతుందని, నేతన్న లు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు వంటి కార్యక్రమాలకు ప్రభుత్వాలు చేస్తున్న సహకారం నేతన్నలకు కొత్త దిశ చూపుతోందని చేనేత రంగం మరింత బలోపేతం కావాలంటే ఈ తరహా కార్యక్రమాలు గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత రంగ వ్యాపారులు,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖ రాణిలు చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి యూనిట్ ఇంచార్జి సల్లా గోవిందు పుషగుచ్చము అందించి, శాలువాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో, మంత్రి లోకేష్ సహకారంతో నేతన్నల అభివృద్ధి కి కృషి చేస్తానని చేనేతల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చేనేత రంగం పునరుద్ధరణకు, ఆధునీకరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చేనేత కుటుంబాల్లో ఆశలు నింపుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం, మంత్రి లోకేష్ సేవలు అద్భుతమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సదస్సులో సీనియర్ చేనేత నాయకులు కన్నా వెంకటేశ్వర్లు తానూ స్వయంగా నేసిన నాణ్యమైన చేనేత వస్త్రం తో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. 13 వ తేదీ చేనేత మంత్రి సవిత చేతులమీదుగా 192 మంది నేతన్నలకు పనిముట్లు అందజేయడం జరుగుతుందని, నేతన్న లు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు వంటి కార్యక్రమాలకు ప్రభుత్వాలు చేస్తున్న సహకారం నేతన్నలకు కొత్త దిశ చూపుతోందని చేనేత రంగం మరింత బలోపేతం కావాలంటే ఈ తరహా కార్యక్రమాలు గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత రంగ వ్యాపారులు,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.