పున్నమి ప్రతినిధి: నారాయణపేట జిల్లా నవంబర్2
నెల రోజులు గడుస్తున్న పట్టించుంచికోని మున్సిపాలిటీ సిబ్బంది
క్రిష్ణ మండలంలోని అలంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు కానీ ఇంకా ఊర్లో వీధి వీధుల్లో ఇలా చెత్త తో కూడిన మోర్లే ఉన్నాయి….
నెల రోజులు గడుస్తున్న పట్టించుకోని పంచాయతీ సిబ్బంది. పాఠశాల ముందు ఐతే మరి అధ్వానంగా మారినాయి రోజు కంపు కొడుతున్న మోరీలు మురికి నీరు వచ్చి చేరి అక్కడే జామై చెత్తాచెదారంతో నిండిపోయి దోమలు వాలుతున్నాయి, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి, అయినా కూడా పంచాయతీ సిబ్బంది మున్సిపాలిటి వాళ్ళు ఇంకా పట్టించుకోకపోవడం పై కారణం తెలియాల్సి ఉంది ఇప్పటికైనా గ్రామ సిబ్బంది వాళ్లు పట్టించుకోని ఈ డ్రైనేజీ వాటర్ ను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్న గ్రామ ప్రజలు, ఇలాగే ముందు ముందు కొనసాగితే పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని గ్రామ పెద్దలు తెలపడం జరిగింది.


