నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని చిట్వేల్ మండలం ఎస్సై ఎస్.వినోద్ కుమార్ హెచ్చరించారు. డ్రింక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా తప్పవని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మార్పు, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చిట్వేల్ మండల ప్రజలు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

నూతన సంవత్సర వేడుకల్లో డ్రింక్ అండ్ డ్రైవ్కు చెక్ – చిట్వేల్ ఎస్సై హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని చిట్వేల్ మండలం ఎస్సై ఎస్.వినోద్ కుమార్ హెచ్చరించారు. డ్రింక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా తప్పవని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మార్పు, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చిట్వేల్ మండల ప్రజలు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

