కాకినాడ రూరల్, శశికాంత్నగర్లో గల ఆదిత్య నర్సింగ్ కాలేజ్ నందు గురువారం ఉదయం నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యతపై అవగహనా సదస్సును ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ డా. ఎన్. శేషారెడ్డి గారు మరియు డైరెక్టర్ డా. ఎన్. సుగుణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సదస్సులో హైదరాబాద్ డాల్ఫిన్టిక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు హాజరై నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై చక్కని అవగహన కల్పిస్తూ మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్లో మరియు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె., మిడిలీస్ట్ దేశాల హాస్పిటల్స్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణను తమ సంస్థ ద్వారా అందిస్తామని దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. ప్రతి విద్యార్థిని యొక్క ఆలోచనలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుని వారి భవిష్యత్తుకు మంచి తర్ఫీదునిచ్చి తోడ్పడతామని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు మరియు ట్రీనిటీ డైరెక్టర్ రిక్కీ గూటమ్, రిటైర్డ్ కర్నల్ డా. ఎస్.బి.రావు, కాకినాడ జి.జి. హెచ్ నర్సింగ్ కాలేజ్ రిటైర్డు ప్రిన్సిపాల్ సుగుణ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ సర్సింగ్ ప్రిన్సిపల్ ఎన్. సంధ్యారాణి మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి లక్ష్మీరావు కృతజ్ఞతలు తెలియజేసారు.

నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై అవగాహనా సదస్సు
కాకినాడ రూరల్, శశికాంత్నగర్లో గల ఆదిత్య నర్సింగ్ కాలేజ్ నందు గురువారం ఉదయం నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యతపై అవగహనా సదస్సును ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ డా. ఎన్. శేషారెడ్డి గారు మరియు డైరెక్టర్ డా. ఎన్. సుగుణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సదస్సులో హైదరాబాద్ డాల్ఫిన్టిక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు హాజరై నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై చక్కని అవగహన కల్పిస్తూ మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్లో మరియు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె., మిడిలీస్ట్ దేశాల హాస్పిటల్స్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణను తమ సంస్థ ద్వారా అందిస్తామని దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. ప్రతి విద్యార్థిని యొక్క ఆలోచనలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుని వారి భవిష్యత్తుకు మంచి తర్ఫీదునిచ్చి తోడ్పడతామని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రైనింగ్ డైరెక్టర్ లక్ష్మీరావు మరియు ట్రీనిటీ డైరెక్టర్ రిక్కీ గూటమ్, రిటైర్డ్ కర్నల్ డా. ఎస్.బి.రావు, కాకినాడ జి.జి. హెచ్ నర్సింగ్ కాలేజ్ రిటైర్డు ప్రిన్సిపాల్ సుగుణ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ సర్సింగ్ ప్రిన్సిపల్ ఎన్. సంధ్యారాణి మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి లక్ష్మీరావు కృతజ్ఞతలు తెలియజేసారు.

