
నరసన్నపేట పద్మావతి జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ కట్టుబాటును వివరించారు. ఆయన కూతురు అర్చన గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతర్ముఖ్ HR కన్సల్టెన్సీ సీఈఓ మకేనా సతీష్ గారు విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. తమ నైపుణ్యాలను పెంపొందించుకొని, ఉద్యోగ రంగంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పద్మావతి కళాశాలల డైరెక్టర్ దుర్గాప్రసాద్, వ్యవస్థాపక డైరెక్టర్ రామచంద్రరావు, వ్యవస్థాపకులు సూరిబాబు గారు మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయికుమార్ గారు పాల్గొని జాబ్ మేళా విజయవంతం కావడానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా, 1000కి పైగా నిరుద్యోగులు పాల్గొని తమకు తగిన అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

