Friday, 6 February 2026
  • Home  
  • నందలూరులో ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు
- అన్నమయ్య

నందలూరులో ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు

నందలూరు మండలం శ్రీ సౌమ్యనాథ ఫిల్లింగ్ స్టేషన్‌లో మాజీ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలో టీడీపీ కార్యకర్తల్లో విశేష ఉత్సాహం నెలకొన్న వేళ, నాయకుడు ఉప్పుశెట్టి సుధీర్ రాయల్ ఆధ్వర్యంలో మిత్రబృందం సమక్షంలో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. విజయ సాగర్ నాయకత్వం టీడీపీకి బలమని, ఆయన ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి ఎంతో మేలు చేశాయని ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రశంసించారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పోరాటం సాగుతుందని, పార్టీకి చిరస్మరణీయమైన సేవలు అందించారని వ్యాఖ్యానించారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ఇచ్చిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు గంధం శెట్టి గంగాధర్, నందలూరు గ్రామ సర్పంచ్ మోడబోతుల రాము, మండల టీడీపీ నాయకులు ఉప్పుశెట్టి రెడ్డయ్య, రాజంపేట మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్, జయచంద్రారెడ్డి, సాయి, వంశీ, పెంచలయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుక మొత్తం సందడి, టీడీపీ కార్యకర్తల ఉత్సాహంతో నిండిపోయింది.

నందలూరు మండలం శ్రీ సౌమ్యనాథ ఫిల్లింగ్ స్టేషన్‌లో మాజీ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలో టీడీపీ కార్యకర్తల్లో విశేష ఉత్సాహం నెలకొన్న వేళ, నాయకుడు ఉప్పుశెట్టి సుధీర్ రాయల్ ఆధ్వర్యంలో మిత్రబృందం సమక్షంలో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది.
విజయ సాగర్ నాయకత్వం టీడీపీకి బలమని, ఆయన ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి ఎంతో మేలు చేశాయని ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రశంసించారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పోరాటం సాగుతుందని, పార్టీకి చిరస్మరణీయమైన సేవలు అందించారని వ్యాఖ్యానించారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ఇచ్చిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు.
కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు గంధం శెట్టి గంగాధర్, నందలూరు గ్రామ సర్పంచ్ మోడబోతుల రాము, మండల టీడీపీ నాయకులు ఉప్పుశెట్టి రెడ్డయ్య, రాజంపేట మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్, జయచంద్రారెడ్డి, సాయి, వంశీ, పెంచలయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన వేడుక మొత్తం సందడి, టీడీపీ కార్యకర్తల ఉత్సాహంతో నిండిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.