నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ఖరీఫ్ 2025 -26 ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్ర జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాదు నుండి ఖరీఫ్ ధాన్యం సేకరణ పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో మాలిక వసతులు కల్పించాలని గన్నిసంచులు, తార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు,మంచినీటి వసతి ఏర్పాట్లు,
ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లు, పోలీస్ సెక్యూరిటీ, ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఎస్ ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి,పౌరసరఫరాల డి ఎమ్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి తదితరులు హాజరైనారు.


