పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.


