యాదాద్రి భువనగిరి జిల్లా ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి
ఈరోజు హైదరాబాద్ చౌరస్తా సవర్కా దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో బ్రాహ్మణులు అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మాయ దశరథ పాల్గొన్నారు. పూజల్లో భరద్వాజ్, నరసింహ, శ్రీకాంత్, నాగరాజు, ఇతరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు.


