ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఐదు రోజుల క్రితం దుబాయ్కు వెళ్లిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు.
ఇటీవల దుబాయ్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అక్కడి ప్రభుత్వం అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.
ఈ పరిణామాల కారణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఎయిర్పోర్టు కార్యకలాపాలకు పూర్తిస్థాయి క్లియరెన్స్ లభించే వరకు భారత్కు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.
అధికారిక అనుమతులు లభించిన వెంటనే ఆయన స్వదేశానికి తిరుగు ప్రయాణం చేపట్టనున్నట్లు సమాచారం.



