పున్నమి ప్రతి నిధి
భద్రాచలం,
“అంత్యోదయ, ఏకాత్మ మానవవాద సిద్ధాంతాలకు రూపకర్తగా, బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా భద్రాచలంలో ఘన నివాళులు అర్పించారు.”
ఈ సందర్భంగా భద్రాచలం బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయ్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించగా, అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది.
కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ కుంజ ధర్మా మాట్లాడుతూ
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 25 సెప్టెంబర్ 1916న జన్మించి, చిన్న వయసులోనే అనేక కష్టాలు ఎదుర్కొన్నా విద్యలో ప్రతిభ కనబర్చారు. 1942లో ఆరెస్సెస్లో చేరి, 1951లో డాక్టర్ శ్యామప్రసాద్ ముకర్జీతో కలిసి భారతీయ జనసంఘానికి పునాదులు వేశారన్నారు 1967లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, 1968లో తన ప్రాణాలు అర్పించే వరకు దేశసేవలో నిలిచారు.*
ఏకాత్మ మానవవాదం అంత్యోదయ ఆయన చూపిన శాశ్వత సిద్ధాంతాలని. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ఆయన లక్ష్యమన్నారు నేటి బీజేపీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలకూ ఇవే ప్రేరణ. యువతకు ఉపాధ్యాయ్ జీవితం స్ఫూర్తిన్నారు
బీజేపీకి ఆయన సిద్ధాంతాలు శాశ్వత దారిదీపమని మనమందరం ఆయన త్యాగం, ఆలోచనలను మార్గదర్శకంగా తీసుకొని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలి అని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన వెంకన్న, పి. ఉపేందర్, పార్టీ సీనియర్ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, దేవరపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడ సుబ్బరావు, బిజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి ములిశెట్టి నిఖిల్ నాయకుడు, పాణిపూరి శ్రీనివాస్, టైలర్ శ్రీనివాస్, వాటర్ ఫిల్టర్ రామాచారి తదితరులు పాల్గొన్నారు.


