శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని దివ్యాంగులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక కీలక ప్రకటన ద్వారా శుభవార్తను తెలియజేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన సదరం (SADAREM) స్లాట్ బుకింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. మార్చి 25వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా స్లాట్ల బుకింగ్ ప్రారంభమవుతుందని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కీలక సమాచారం. స్లాట్ బుకింగ్ ప్రారంభం మార్చి 25, వైద్య పరీక్షల నిర్వహణ మార్చి 30 నుండి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయి. బుకింగ్ కేంద్రాలు సమీపంలోని మీ సేవ కేంద్రాలు లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని నూతన సాఫ్ట్వేర్ ద్వారా పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి త్వరితగతిన డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. 40% వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నుండి నెలవారీ పింఛను అందుతుందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. రైల్వే రాయితీలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ సర్టిఫికెట్ ప్రామాణికంగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత తేదీల్లో స్లాట్లు బుక్ చేసుకుని, వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సంక్షేమ ఫలాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని దివ్యాంగులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక కీలక ప్రకటన ద్వారా శుభవార్తను తెలియజేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన సదరం (SADAREM) స్లాట్ బుకింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. మార్చి 25వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా స్లాట్ల బుకింగ్ ప్రారంభమవుతుందని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కీలక సమాచారం. స్లాట్ బుకింగ్ ప్రారంభం మార్చి 25, వైద్య పరీక్షల నిర్వహణ మార్చి 30 నుండి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయి. బుకింగ్ కేంద్రాలు సమీపంలోని మీ సేవ కేంద్రాలు లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని నూతన సాఫ్ట్వేర్ ద్వారా పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి త్వరితగతిన డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. 40% వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం నుండి నెలవారీ పింఛను అందుతుందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. రైల్వే రాయితీలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ సర్టిఫికెట్ ప్రామాణికంగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత తేదీల్లో స్లాట్లు బుక్ చేసుకుని, వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సంక్షేమ ఫలాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

