పున్నమి ప్రతినిధి:
దసరా ఎఫెక్ట్ ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సోమవారం ఒక్క రోజులోనే రూ. 278.66 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. వరుస సెలవులు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు మద్యం విక్రయాల ద్వారా రూ. 2,715 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ, గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.


