వెల్దండ, అక్టోబర్ 21, పున్నమి న్యూస్: వెల్దండ మండలంలో సిలోన్ బండ తండా గ్రామపంచాయతీ లో ఇటీవల కురిసిన వర్షాలకు లో లెవెల్ వంతెన (బ్రిడ్జి) పూర్తిగా ధ్వంసమై తండా వాసులకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ విషయాన్ని సిలోన్ బండ తండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా సంజీవ్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకుపోగా.. వెంటనే స్పందించి రెండు గూనలు (గబీన్లు) ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అలాగే లో వోల్టేజ్ విద్యుత్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 25 కెవి వోల్టేజ్ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పించారు . స్తంభించిపోయిన రాకపోకలకు తక్షణ మరమ్మతులు చేయించి దారి చూపాడని, లో వోల్టేజితో ఇబ్బంది పడుతున్న గ్రామానికి వెలుగులు నింపారని సిలోన్ బండ తండా వాసులు గ్రామస్తులు సంజీవ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాత్లవత్ రమేష్ తన సొంత ఖర్చులతో జెసిబి తో పని చేయించాడు. రమేష్ నాయక్, రామ్ లాల్ నాయక్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

తెగిపోయిన లో లెవెల్ వంతెన.. మరమ్మతులు చేయించిన మార్కెట్ కమిటీ చైర్మన్.
వెల్దండ, అక్టోబర్ 21, పున్నమి న్యూస్: వెల్దండ మండలంలో సిలోన్ బండ తండా గ్రామపంచాయతీ లో ఇటీవల కురిసిన వర్షాలకు లో లెవెల్ వంతెన (బ్రిడ్జి) పూర్తిగా ధ్వంసమై తండా వాసులకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ విషయాన్ని సిలోన్ బండ తండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా సంజీవ్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకుపోగా.. వెంటనే స్పందించి రెండు గూనలు (గబీన్లు) ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అలాగే లో వోల్టేజ్ విద్యుత్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 25 కెవి వోల్టేజ్ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పించారు . స్తంభించిపోయిన రాకపోకలకు తక్షణ మరమ్మతులు చేయించి దారి చూపాడని, లో వోల్టేజితో ఇబ్బంది పడుతున్న గ్రామానికి వెలుగులు నింపారని సిలోన్ బండ తండా వాసులు గ్రామస్తులు సంజీవ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాత్లవత్ రమేష్ తన సొంత ఖర్చులతో జెసిబి తో పని చేయించాడు. రమేష్ నాయక్, రామ్ లాల్ నాయక్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

