నందిగామ పట్టణం, తొమ్మిదవ వార్డు తమ్మవరపు మంగపతి సతీమణి చంద్రమ్మ ఇటీవల మరణించిన విషాద వార్త తెలుసుకున్న నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, తమ్మవరపు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించామని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం బుచ్చిబాబు, వీసం జగదీష్ పాల్గొన్నారు.

తమ్మవరపు మంగపతి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి
నందిగామ పట్టణం, తొమ్మిదవ వార్డు తమ్మవరపు మంగపతి సతీమణి చంద్రమ్మ ఇటీవల మరణించిన విషాద వార్త తెలుసుకున్న నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, తమ్మవరపు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించామని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం బుచ్చిబాబు, వీసం జగదీష్ పాల్గొన్నారు.

