సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డిని మంగళవారం సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్(రాజా) మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందజేశారు. నెల్లూరులోని డిసిసిబి కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల సొసైటీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు ఎస్. రాజా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేకంగా డిసిసిబి చైర్మన్ ను కలిసి సీతారామపురం మండల సమస్యలపై చర్చించారు. సీతారామపురం మండల రైతులను ఆదుకునేలా రుణాలను మంజూరు చేయాలని అదేవిధంగా సొసైటీ కాంప్లెక్స్ గదులు, గోడౌన్ నిర్మాణాల ప్రతిపాదనలను అంగీకరించి,వేగంగా పనులు జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు భోగినేని కాశీ రత్తయ్య(గాంధీ) తదితరులు ఉన్నారు.


