Friday, 27 March 2026
  • Home  
  • టైరు పేలి ఇద్దరికీ గాయాలు.
- జోగులాంబ గద్వాల

టైరు పేలి ఇద్దరికీ గాయాలు.

అలంపూర్ : సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి వాహనం బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం ఉండవల్లి మండలంలో చోటు చేసుకున్నది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. కడప నుండి కుటుంబ సభ్యులతో కలిసి (ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి) హరి షాద్నగర్ కు కారులో వెళ్తుండగా ఉండవెల్లి స్టేజి సమీపంలోకి రాగానే టైర్ పగిలి, కారు పల్టీలు కొట్టి పక్క రోడ్డులో పడింది. దీనితో హరికి గాయాలు కాగా, భార్య శివాని భుజానికి బలమైన గాయం. బాబుకు, హరి తల్లి భాగ్యమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటి రాధ మోహన్, పైలెట్ నరేష్ పేర్కొన్నారు.

అలంపూర్ : సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి )
జోగులంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి వాహనం బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం ఉండవల్లి మండలంలో చోటు చేసుకున్నది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. కడప నుండి కుటుంబ సభ్యులతో కలిసి (ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి) హరి షాద్నగర్ కు కారులో వెళ్తుండగా ఉండవెల్లి స్టేజి సమీపంలోకి రాగానే టైర్ పగిలి, కారు పల్టీలు కొట్టి పక్క రోడ్డులో పడింది. దీనితో హరికి గాయాలు కాగా, భార్య శివాని భుజానికి బలమైన గాయం. బాబుకు, హరి తల్లి భాగ్యమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటి రాధ మోహన్, పైలెట్ నరేష్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.