Sunday, 7 December 2025
  • Home  
  • జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు* *కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు*
- E-పేపర్

జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు* *కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు*

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మరియు నిర్మాణ రంగానికి, మేలు చేసిందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 14, 15, 16 డివిజన్ నందు సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యవసర వస్తువులకు జీఎస్టీ తగ్గించిందని, జిఎస్టి తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు ఖర్చు తగ్గుతుందని, నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జిఎస్టి ద్వారా నిర్మాణ రంగానికి ఊతం లభించి, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు వ్యయం తగ్గి మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరదాడి శివ, మల్లాడి చిన్న,మల్లాడి రాజు, కోనాడ ప్రకాష్,పినపోతు రాము, మల్లాడి ఏడుకొండలు,పినపోతు జీవ రత్నం,పట్టా ధనలక్ష్మి, పాలెపు రాజు, వనమాడి కృపావర్మ, ఓలేటి పాండురంగడు,బలసాడి శ్రీను, మల్లాడి గంగాధరం,బలసాడి శ్రీను, కామాడి సుబ్బారావు,వనమాడి ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్:
జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మరియు నిర్మాణ రంగానికి, మేలు చేసిందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక 14, 15, 16 డివిజన్ నందు సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యవసర వస్తువులకు జీఎస్టీ తగ్గించిందని, జిఎస్టి తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు ఖర్చు తగ్గుతుందని, నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జిఎస్టి ద్వారా నిర్మాణ రంగానికి ఊతం లభించి, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు వ్యయం తగ్గి మేలు కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అరదాడి శివ, మల్లాడి చిన్న,మల్లాడి రాజు, కోనాడ ప్రకాష్,పినపోతు రాము, మల్లాడి ఏడుకొండలు,పినపోతు జీవ రత్నం,పట్టా ధనలక్ష్మి, పాలెపు రాజు, వనమాడి కృపావర్మ, ఓలేటి పాండురంగడు,బలసాడి శ్రీను, మల్లాడి గంగాధరం,బలసాడి శ్రీను, కామాడి సుబ్బారావు,వనమాడి ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.