Wednesday, 25 March 2026
  • Home  
  • జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలినంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08514-293903 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
- E-పేపర్

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలినంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08514-293903 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబరు 08514-293903 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24-7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో కార్యాలయాలు, తాసిల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలి. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్దంగా ఉంచుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబరు 08514-293903 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24-7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో కార్యాలయాలు, తాసిల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలి. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్దంగా ఉంచుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.