నిర్మల్ నవంబర్ 07 (పున్నమి ప్రతినిధి)
జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి భావాలను మేల్కొల్పడంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


