ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో కాలనీలో జలమయమయ్యాయి. లింగసాని కుంట మత్తడి పోయడంతో, ఆ నీరు గ్రామంలోనీ ఇళ్లలోకి చేరుతుంది. గతంలో ఈ కుంట నిండి, బుడుగుల కుంటలోకి చేరేది. కొందరి మొండి వైఖరి తో కట్టు కాలువ వెయ్యడం వల్లే ఈ రోజు గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. కట్టు కాలువ వేయొద్దని రైతులు చెప్పిన వినకుండా వేయడంతో ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్షం ఇలాగే కొనసాగితే నీరు ఇండ్లలోకి చేరుతుందని, పిల్లలు ,వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

జలమయంగా మారిన తానేదార్ పల్లి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో కాలనీలో జలమయమయ్యాయి. లింగసాని కుంట మత్తడి పోయడంతో, ఆ నీరు గ్రామంలోనీ ఇళ్లలోకి చేరుతుంది. గతంలో ఈ కుంట నిండి, బుడుగుల కుంటలోకి చేరేది. కొందరి మొండి వైఖరి తో కట్టు కాలువ వెయ్యడం వల్లే ఈ రోజు గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. కట్టు కాలువ వేయొద్దని రైతులు చెప్పిన వినకుండా వేయడంతో ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్షం ఇలాగే కొనసాగితే నీరు ఇండ్లలోకి చేరుతుందని, పిల్లలు ,వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

