శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాళహస్తి నియోజకవర్గం,పట్టణంలోని గోపాల వనం వీధికి చెందిన జనసేన కార్యకర్త బుర్ర ప్రియాంక కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. పార్టీ తరపున మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అందజేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఈ చెక్కును ప్రియాంక భర్త బుర్ర చైతన్యకాంత్కు అందజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకుడు పసుపులేటి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత పవన్ కల్యాణ్ గారు దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘క్రియాశీలక సభ్యత్వ’ పథకం నేడు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. శ్రీకాళహస్తిలో ఈ బీమా ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన నవీన్ కుమార్కు మృతురాలి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆనంతరం తాళ్లూరి రామ్ మాట్లాడుతూ..ప్రాణాలు కోల్పోయిన ప్రతి జనసైనికుడి కుటుంబం రోడ్డున పడకూడదన్నదే పార్టీ ఆశయమని, సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవలి ఘటనలు సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయని, యువత అధిక సంఖ్యలో సభ్యత్వం పొంది ఈ భరోసాను వినియోగించుకోవాలని నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

జనసేన కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాళహస్తి నియోజకవర్గం,పట్టణంలోని గోపాల వనం వీధికి చెందిన జనసేన కార్యకర్త బుర్ర ప్రియాంక కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. పార్టీ తరపున మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అందజేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఈ చెక్కును ప్రియాంక భర్త బుర్ర చైతన్యకాంత్కు అందజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకుడు పసుపులేటి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత పవన్ కల్యాణ్ గారు దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘క్రియాశీలక సభ్యత్వ’ పథకం నేడు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. శ్రీకాళహస్తిలో ఈ బీమా ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన నవీన్ కుమార్కు మృతురాలి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆనంతరం తాళ్లూరి రామ్ మాట్లాడుతూ..ప్రాణాలు కోల్పోయిన ప్రతి జనసైనికుడి కుటుంబం రోడ్డున పడకూడదన్నదే పార్టీ ఆశయమని, సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవలి ఘటనలు సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయని, యువత అధిక సంఖ్యలో సభ్యత్వం పొంది ఈ భరోసాను వినియోగించుకోవాలని నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

