అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
ఇరిగేషన్ ఈ ఈ రవికుమార్, డి ఈ సురేష్, ఏఈ యాసిన్, బాలసుబ్రహ్మణ్యం లు పాడేరు చెరువు తూము గుండా వృథాగా పోతున్న నీటిని పరిశీలించారు. నీటి వృథాను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువు నీటిని సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా చెరువు అధ్యక్షుడు స్వర్ణ రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ యరగర్ల మనోహర్, సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య, సర్పంచ్ గుమ్మ వెంకటేశ్వర్లు మరియు రైతులు పాల్గొన్నారు.


