Sunday, 29 March 2026
  • Home  
  • చిన్నారుల కన్నీళ్లను తుడిచిన కార్తీక్ రెడ్డి – అనాథలైన చిన్నారులకు 2,00,000 ఆర్థిక సహాయం*
- రంగారెడ్డి

చిన్నారుల కన్నీళ్లను తుడిచిన కార్తీక్ రెడ్డి – అనాథలైన చిన్నారులకు 2,00,000 ఆర్థిక సహాయం*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఇద్దరు చిన్నారుల కోసం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముందుకు వచ్చి ఉదారత చూపారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ దంపతులు అమానుష ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు. ఈ ఘటన వివరాలు ”చేవెళ్ల న్యూస్” వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, సంరక్షణ కోసం రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రూప్ సభ్యులతో పాటు స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని “చేవెళ్ల న్యూస్” గ్రూప్ తరఫున పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో వారి తరఫున కార్తీక్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఇద్దరు చిన్నారుల కోసం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముందుకు వచ్చి ఉదారత చూపారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ దంపతులు అమానుష ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు. ఈ ఘటన వివరాలు ”చేవెళ్ల న్యూస్” వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, సంరక్షణ కోసం రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రూప్ సభ్యులతో పాటు స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని “చేవెళ్ల న్యూస్” గ్రూప్ తరఫున పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో వారి తరఫున కార్తీక్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.