చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి)
చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు. భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.


