ప్రజా సేవలో ‘మర్యాద’, కేసుల పరిష్కారంలో ‘వేగం’ అవసరం – ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
అన్నమయ్య జిల్లా పోలీస్ సేవల్లో పారదర్శకత, సమర్థత పెంపు లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం చిట్వేల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసుల పురోగతి, సిబ్బంది సంక్షేమ అంశాలను ఎస్పీ సమీక్షించారు.
పాత భవనం కావడంతో స్టేషన్కు తక్షణ మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తూ, సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల వివరాలను క్రమం తప్పకుండా అప్లోడ్ చేయాలన్నారు.
నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, వినయంగా ప్రవర్తించడం పోలీసుల కర్తవ్యం అని స్పష్టం చేశారు.
చిట్వేల్ పోలీస్ స్టేషన్ జిల్లా సరిహద్దులో ఉన్నందున, అనుంపల్లి చెక్పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం పట్ల శ్రద్ధ చూపి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, చిట్వేల్ ఎస్ఐ జి. నవీన్ బాబు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


