Friday, 6 February 2026
  • Home  
  • చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం.

15-08-2025 ఉదయగిరి చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం..! ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్త్రీ శక్తి బస్సును ప్రారంభించిన ఎంపీపీ మెట్టుకూరి శిరీషా..! ఉదయగిరి ఆగస్టు 15 చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరి శిరీషా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు. అంతకుముందు బస్సును ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని తెలిపారు. చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 అనగా ఈరోజు నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో ఉదయగిరి చిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్ డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఇన్చార్జి కదిరి రంగారావు, గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసు మల్లి వెంకటసుబ్బయ్య, మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, ఆర్టీసీ సిబ్బంది మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

15-08-2025 ఉదయగిరి

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం..!

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్త్రీ శక్తి బస్సును ప్రారంభించిన ఎంపీపీ మెట్టుకూరి శిరీషా..!

ఉదయగిరి ఆగస్టు 15

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరి శిరీషా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు. అంతకుముందు బస్సును ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని తెలిపారు. చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 అనగా ఈరోజు నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో ఉదయగిరి చిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్ డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఇన్చార్జి కదిరి రంగారావు, గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసు మల్లి వెంకటసుబ్బయ్య, మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, ఆర్టీసీ సిబ్బంది మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.