
వైభవంగా శ్రీ మరిడిమాంబ ఆలయ 26వ వార్షికోత్సవం
అగనంపూడి, జనవరి 31, పున్నమి ప్రతినిధి.
జీవీఎంసీ 85 వార్డ్ కొండయ్య వలస గ్రామ ఆరాధ్య దేవత శ్రీ మరిడిమాంబ ఆలయం 26 సంవత్సరాలు సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు సారీ ఊరేగింపు జరిగింది. అనంతరం అమ్మవారిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 85 వార్డు, కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిఠిటి, అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ సూపర్డెంట్ డి రాజేశ్వరి, స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావు, దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ దొర, ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, కూటమి నాయకులు కర్రి దశాంద్ర, గవర సోమశేఖర్, కోసూరి తాతారావు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బలిరెడ్డి శ్రీను, కార్యదర్శి బుదిరెడ్డి అప్పారావు గ్రామ పెద్దలు యూత్ మహిళలు పాల్గొన్నారు. 50వేల రూపాయలతో రకరకాల పువ్వులతో శ్రీ మరిడిమాంబ తల్లిని, ఆలయమును డెకరేషన్ చేసిన యూత్ పలక సాయినాథ్, అల్లం హరిప్రసాద్, గొల్లవిల్లి శివకుమార్, బోండా జయదీప్, గంగిరెడ్ల సంతోష్, బలిరెడ్డి వంశీల ను పల్లా శ్రీనివాసరావు మనిషా త్రిపొఠి అభినందించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగినది.

