Sunday, 7 December 2025
  • Home  
  • ఘనంగా పోషణ మహోత్సవాలు.
- సత్యసాయి

ఘనంగా పోషణ మహోత్సవాలు.

అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నిలువరాతిపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మహోత్సవాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ గంగాదేవి మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.పోషణ మహోత్సవాల విశిష్టతను తెలియజేశారు.తల్లిపాల విశిష్టతను,అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి కొద్దికొద్దిగా మోతాదులో మొదలుపెట్టి పూర్తిగా రెండేళ్ల వయసు వచ్చేవరకు ఆహార అలవాట్లు వచ్చే విధంగా ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేస్తారన్నారు.అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పౌష్టికాహారంతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రదర్శించారు.అలాగే ఈనెల 10వ తేదీన కిషోర్ బాలికల దినోత్సవ సందర్భంగా సచివాలయ సిబ్బంది,ఐసిడిస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్సే రైటింగ్ తోపాటు బాల్య వివాహాలు,గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి పోటీలు నిర్వహించారు.పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 10న బహుమతులు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఏఎన్ఎం త్రివేణి,అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీకాంతమ్మ,భారతి,రామలక్ష్మమ్మ, లక్ష్మీదేవమ్మ,బేబీ,ప్రమీలమ్మ,ప్రవల్లిక,ఆశ వర్కర్లు పుష్పావతమ్మ,శశికళ,కుళ్లాయమ్మ,తులసి, గర్భవతులు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.

అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నిలువరాతిపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మహోత్సవాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ గంగాదేవి మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.పోషణ మహోత్సవాల విశిష్టతను తెలియజేశారు.తల్లిపాల విశిష్టతను,అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి కొద్దికొద్దిగా మోతాదులో మొదలుపెట్టి పూర్తిగా రెండేళ్ల వయసు వచ్చేవరకు ఆహార అలవాట్లు వచ్చే విధంగా ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేస్తారన్నారు.అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పౌష్టికాహారంతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రదర్శించారు.అలాగే ఈనెల 10వ తేదీన కిషోర్ బాలికల దినోత్సవ సందర్భంగా సచివాలయ సిబ్బంది,ఐసిడిస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్సే రైటింగ్ తోపాటు బాల్య వివాహాలు,గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి పోటీలు నిర్వహించారు.పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 10న బహుమతులు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఏఎన్ఎం త్రివేణి,అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీకాంతమ్మ,భారతి,రామలక్ష్మమ్మ, లక్ష్మీదేవమ్మ,బేబీ,ప్రమీలమ్మ,ప్రవల్లిక,ఆశ వర్కర్లు పుష్పావతమ్మ,శశికళ,కుళ్లాయమ్మ,తులసి, గర్భవతులు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.