శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02,ప్రపంచవ్యాప్తంగా గ్రహణ కాలంలో ఆలయాలన్నీ తలుపులు మూసివేసి, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. దానికి భిన్నంగా, గ్రహణ పట్టు విడుపు కాలంలో కూడా భక్తులతో కళకళలాడే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ విశేష అభిషేకాలు నిర్వహించడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆలయ వేద పండితులు వివరింస్తూ.. శ్రీకాళహస్తి క్షేత్రం గ్రహణాలకు ఎందుకు అతీతమో వివరిస్తూ.. ఇక్కడ కొలువైన స్వామివారు, అమ్మవార్ల సర్పరూపాలే దానికి ప్రధాన కారణమని ఇక్కడి శివలింగం ఐదు తలల పాము (నాగపడిగ) నీడలో కొలువై ఉంటుందని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు నాగపాము ఒడ్యాణంగా ఉంటుంది. సాధారణంగా గ్రహణాలకు కారణమయ్యే రాహు, కేతువులు సర్ప రూపధారులు. సాక్షాత్తు ఆ సర్పాలనే ఆభరణాలుగా ధరించిన స్వామి, అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉండటం వల్ల, గ్రహణ ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదని వేద పండితులు స్పష్టం చేశారు. గ్రహణ సమయం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు (పట్టు-విడుపు కాలం) స్వామివారికి, అమ్మవారికి నిరంతరాయంగా విశేష అభిషేకాలు జరపడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇతర ఆలయాల్లో గ్రహణం వీడిన తర్వాతే తలుపులు తీసి సంప్రోక్షణ చేస్తారు, కానీ శ్రీకాళహస్తిలో గ్రహణ సమయమే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహు-కేతు దోషాలు ఉన్నవారు, గ్రహణ సమయంలో ఇక్కడ జరిగే అభిషేకాల్లో పాల్గొనడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్ప దోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది కావడంతో, గ్రహణ కాలంలో కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అర్చకులు తెలపారు.

గ్రహణాలకూ లొంగని మహాక్షేత్రం- శ్రీకాళహస్తిలో ఆగని అభిషేకాలు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02,ప్రపంచవ్యాప్తంగా గ్రహణ కాలంలో ఆలయాలన్నీ తలుపులు మూసివేసి, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. దానికి భిన్నంగా, గ్రహణ పట్టు విడుపు కాలంలో కూడా భక్తులతో కళకళలాడే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ విశేష అభిషేకాలు నిర్వహించడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆలయ వేద పండితులు వివరింస్తూ.. శ్రీకాళహస్తి క్షేత్రం గ్రహణాలకు ఎందుకు అతీతమో వివరిస్తూ.. ఇక్కడ కొలువైన స్వామివారు, అమ్మవార్ల సర్పరూపాలే దానికి ప్రధాన కారణమని ఇక్కడి శివలింగం ఐదు తలల పాము (నాగపడిగ) నీడలో కొలువై ఉంటుందని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు నాగపాము ఒడ్యాణంగా ఉంటుంది. సాధారణంగా గ్రహణాలకు కారణమయ్యే రాహు, కేతువులు సర్ప రూపధారులు. సాక్షాత్తు ఆ సర్పాలనే ఆభరణాలుగా ధరించిన స్వామి, అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉండటం వల్ల, గ్రహణ ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదని వేద పండితులు స్పష్టం చేశారు. గ్రహణ సమయం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు (పట్టు-విడుపు కాలం) స్వామివారికి, అమ్మవారికి నిరంతరాయంగా విశేష అభిషేకాలు జరపడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇతర ఆలయాల్లో గ్రహణం వీడిన తర్వాతే తలుపులు తీసి సంప్రోక్షణ చేస్తారు, కానీ శ్రీకాళహస్తిలో గ్రహణ సమయమే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహు-కేతు దోషాలు ఉన్నవారు, గ్రహణ సమయంలో ఇక్కడ జరిగే అభిషేకాల్లో పాల్గొనడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్ప దోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది కావడంతో, గ్రహణ కాలంలో కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అర్చకులు తెలపారు.

