వినాయక నిమజ్జన సమయంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన యువకుడిని అమలాపురం పోలీసులు చాకచక్యంగా రక్షించారు.పేరూరు గ్రామంలోని పల్లపు వీధి (రాజ్యలక్ష్మి గుడి వద్ద) దూడల సత్యమూర్తి కమిటీకి చెందిన వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 09:15 ని.ల సమయంలో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద గోదావరి నదిలో కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కలసి నిమజ్జనం చేసే సందర్భంలో పేరూరు గ్రామం దూడల వారి వీధికి చెందిన చిలుకూరి చిన సాయి కృష్ణ అనే యువకుడు నీటిలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలో కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నా, మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించి మత్స్యకారులను సహాయానికి పిలిపించారు. పడవ సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.పోలీసులు అప్రమత్తంగా లేకపోతే యువకుడు గల్లంతయ్యే ప్రమాదం తప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.
గోదావరిలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు
వినాయక నిమజ్జన సమయంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన యువకుడిని అమలాపురం పోలీసులు చాకచక్యంగా రక్షించారు.పేరూరు గ్రామంలోని పల్లపు వీధి (రాజ్యలక్ష్మి గుడి వద్ద) దూడల సత్యమూర్తి కమిటీకి చెందిన వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 09:15 ని.ల సమయంలో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద గోదావరి నదిలో కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కలసి నిమజ్జనం చేసే సందర్భంలో పేరూరు గ్రామం దూడల వారి వీధికి చెందిన చిలుకూరి చిన సాయి కృష్ణ అనే యువకుడు నీటిలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలో కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నా, మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించి మత్స్యకారులను సహాయానికి పిలిపించారు. పడవ సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.పోలీసులు అప్రమత్తంగా లేకపోతే యువకుడు గల్లంతయ్యే ప్రమాదం తప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.

