– తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం
కామారెడ్డి,30 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను తెలు సుకున్న వెంటనే గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించారు. పాత మోటర్ను తీసివేసి, కొత్త బోరు మోటార్ను త్వరగా బిగించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీర్చిపెట్టారు. గ్రామ స్తుల సౌకర్యం కోసం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన పాలకవర్గానికి గ్రామవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి త్వరిత చర్యలు గ్రామంలో అభివృద్ధికి మేలు కలిగిస్తాయని సర్పం చ్ కిషన్ యాదవ్ అన్నారు.ఈ సంఘటన గ్రామ పంచాయతీల్లో ప్రజా సంక్షేమానికి పాలకుల వెంట నే స్పందించామని అన్ఎంనారు.గొల్లపల్లి గ్రామస్తు లు ఇప్పుడు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కిషన్ యాదవ్, గ్రామ సెక్రటరీ జనార్ధ న్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


