కామారెడ్డి 13 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ గురువారం జరిగిన ఎన్నికల్లో 5వ వార్డు సభ్యునిగా ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ని ఎదుర్కొని గెలిచిన ఈ నాయకుడిని మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు శాలువాతో ఘనంగా సత్కరించారు.రెడ్డి మల్లేష్ మాట్లాడు తూ, “5వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను! వారికి ఏ కష్టం వచ్చినా పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాను. వార్డులో నెలకొన్న అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం కల్పిస్తాను” అని హామీ ఇచ్చారు.పార్టీ సోలిడారిటీతో గెలిచిన ఈ విజయం, టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పింది.


