Saturday, 19 July 2025
  • Home  
  • గూడూరు శ్రీమంతులు
- Featured

గూడూరు శ్రీమంతులు

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : కోట్ల రూపాయల ఆస్తి పరులు వెయ్యి రూపాయలు సహాయం చేయడం గొప్పకాదు. వెయ్యిరూపాయలు జేబులో ఉన్నప్పుడు అది పూర్తిగా పేదలకు ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి దాతృత్వం కేవలం మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. మన గూడూరులో ఇలాంటి మహానుభావులకు కొదవేలేదు. ఉదాహరణకు మిత్ర ఫౌండేషన్, మై ఫ్రెండ్స్ అసోసియేషన్, స్వాంతన, ఈద్గా యూత్ కమిటీ, ఆల్ ఇస్లాం, మఖ్దూమ్ చారిటీ లాంటివి పేదప్రజల అభ్యున్నతికి ఎదో ఒక రూపేణా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే గూడూరికి చెందిన హార్ట్ టూ హాండ్ (H2H) ఫౌండేషన్ సంస్థ. ఈ సంస్థ గత రెండు నెలల నుంచి నిరంతరంగా పేదప్రజల అవసరాలకు తమ తోడ్పాటు అందిస్తున్నది. ఈ సంస్థ అధ్యక్షుడు వాకా నిరంజన్ వారి మిత్రులు తమ శక్తికి మించి చేస్తున్న సహాయకార్యక్రమాలు శ్రీమంతులను సైతం సిగ్గుపడేలా చేస్తున్నాయి. నేడు దేశంవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సామాన్యులను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేయబడిందని అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో పేదప్రజలను ఆదుకోవడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అందులో భాగంగా గూడూరులోని గాంధీనగర్ కు చెందిన కార్మికులు మరియు పేదవారికి నిత్యావసర సరుకులను పంచడం జరిగిందని వాకా నిరంజన్ తెలియచేసారు. అలాగే నెల్లటూరు దగ్గర ఉన్న నిమ్మకాయల మార్కెట్టుకు సమీపంలోని నిరుపేదలకు మొత్తం దాదాపు 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశామని నిరంజన్ చెప్పారు. చిన్నపిల్లలకు తినుబండారాలతో పాటు మాస్కులు సైతం పంచినట్టు నిరంజన్ పేర్కొన్నారు. కరోనా వ్యాధి దరి చేరకుండా భౌతిక దూరం, పరిశుభ్రత లాంటి విధానాలు యొక్క అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు హార్ట్ టూ హాండ్ (H2H) సంస్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో H2H ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్ ,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, ముని దయాకర్ తో పాటు స్థానికులు పాల్గొన్నట్టు వాకా నిరంజన్ వివరించారు.

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : కోట్ల రూపాయల ఆస్తి పరులు వెయ్యి రూపాయలు సహాయం చేయడం గొప్పకాదు. వెయ్యిరూపాయలు జేబులో ఉన్నప్పుడు అది పూర్తిగా పేదలకు ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి దాతృత్వం కేవలం మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. మన గూడూరులో ఇలాంటి మహానుభావులకు కొదవేలేదు. ఉదాహరణకు మిత్ర ఫౌండేషన్, మై ఫ్రెండ్స్ అసోసియేషన్, స్వాంతన, ఈద్గా యూత్ కమిటీ, ఆల్ ఇస్లాం, మఖ్దూమ్ చారిటీ లాంటివి పేదప్రజల అభ్యున్నతికి ఎదో ఒక రూపేణా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే గూడూరికి చెందిన హార్ట్ టూ హాండ్ (H2H) ఫౌండేషన్ సంస్థ. ఈ సంస్థ గత రెండు నెలల నుంచి నిరంతరంగా పేదప్రజల అవసరాలకు తమ తోడ్పాటు అందిస్తున్నది. ఈ సంస్థ అధ్యక్షుడు వాకా నిరంజన్ వారి మిత్రులు తమ శక్తికి మించి చేస్తున్న సహాయకార్యక్రమాలు శ్రీమంతులను సైతం సిగ్గుపడేలా చేస్తున్నాయి. నేడు దేశంవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సామాన్యులను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేయబడిందని అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో పేదప్రజలను ఆదుకోవడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అందులో భాగంగా గూడూరులోని గాంధీనగర్ కు చెందిన కార్మికులు మరియు పేదవారికి నిత్యావసర సరుకులను పంచడం జరిగిందని వాకా నిరంజన్ తెలియచేసారు. అలాగే నెల్లటూరు దగ్గర ఉన్న నిమ్మకాయల మార్కెట్టుకు సమీపంలోని నిరుపేదలకు మొత్తం దాదాపు 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశామని నిరంజన్ చెప్పారు. చిన్నపిల్లలకు తినుబండారాలతో పాటు మాస్కులు సైతం పంచినట్టు నిరంజన్ పేర్కొన్నారు. కరోనా వ్యాధి దరి చేరకుండా భౌతిక దూరం, పరిశుభ్రత లాంటి విధానాలు యొక్క అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు హార్ట్ టూ హాండ్ (H2H) సంస్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో H2H ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్ ,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, ముని దయాకర్ తో పాటు స్థానికులు పాల్గొన్నట్టు వాకా నిరంజన్ వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.