పున్నమి న్యూస్ (కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం క్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ 75 వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, సీనియర్ నాయకులు అల్లవరపు రవి శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆలయ ప్రాంగణం లో 75 ద్వీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, మండల ఇంచార్జి మోకా ఆదిలక్ష్మి, రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకుమర్తి బేబీరాణి, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు, తాడినాటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పోతుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


